రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సదవకాశమిది: ఎమ్మెల్యే అజయ్
రఘునాథపాలెం, జూన్ 5: తెల్ల కాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరిపిన రైతులు వాటిపై హక్కులు పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామా ద్వారా కల్పించిందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండలంలోని వీ వెంకటాయపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన సాదాబైనామా ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అర్హులైన పేదలందరూ సాదాబైనామాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరక్ష్యరాస్యులైన పేదలు గతంలో కేవలం తెల్లకాగితాలపైనే భూముల క్రయవిక్రయాలు జరుపుకునే వారన్నారు. దీంతో వారికి బ్యాంకు రుణాలు, పహాణీలు అందక అనేక ఇబ్బందులు పడే వారని అన్నారు.
వారి ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సాదాబైనామా ద్వారా అవకాశాన్ని కల్పించారన్నారు. అర్హులైన రైతులందరూ సాదాబైనామాను సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసుకున్న భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. అనంతరం సాదాబైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల హేమలత, జడ్పీటీసీ వీరూనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్ఐ వహీద్, టీఆర్ఎస్ నాయకులు ఆర్.శ్రీనివాస్, యరగర్ల హనుమంతరావు, మందడపు నర్సింహారావు, ఆవుల కోదండరాములు, భుక్యా లక్ష్మణ్నాయక్, కిలారు వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, తగరం శ్రీను, తొలుపునూరి దానయ్య, ఆనందరావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment