ఖమ్మం వ్యవసాయం, జూన్ 5: విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలి. కొనుగోళ్లు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయశాఖ ద్వారా లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. సరిగ్గా సీలు వేసి ధ్రువీకరణ పత్రం ఉన్న విత్తనాల భస్తాలనే కొనాలి. బస్తాపై విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ వంటి విషయాలను పరిగణంలోకి తీసుకోవాలి. బిల్లుపై విక్రయ దారుడి పేరు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అమ్మకం నంబర్, రైతు పేరు, గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, నికర తూకం, గడువు తేదీలు, కంపెనీ పేరు తప్పని సరిగా నమోదు చేయాలి. హైబ్రిడ్ విత్తనాలు కొనేటప్పుడు స్వచ్ఛత, మొలక శాతాన్ని పరిగణంలోకి తీసుకోవాలి.
మొలకెత్తే దశలో, పూతదశలో, లోపాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. ఒకవేళ అరువు పద్ధతిలో కొనుగోలు చేసినప్పటికీ బిల్లు తీసుకోవడం మరువరాదు. ముఖ్యంగా మొలక శాతం సక్రమంగా ఉన్న విత్తనాలకే ప్రాముఖ్యత నిచ్చి కొనుగోలు జరపాలి. పురుగు మందులు కొనే సమయంలో వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తల సూచనల ప్రకారం లైసెన్స్ గల క్రిమిసంహారక మందులను మాత్రమే కొనుగోలు చేయాలి. పురుగుమందు డబ్బాపై వజ్రాకారంలో మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. లైసెన్స్ గల షాపుల్లో మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలి. వాటి బిల్లులను, సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు దాచి ఉంచాలి. పోషకాల వివరాలు, ఉత్పత్తి చేసిన సంస్థ, ఉప్పత్తిదారుడి పేరు, కచ్చితంగా ఉండాలి.
No comments:
Post a Comment