Sunday, 5 June 2016

8న జిల్లాకుడిప్యూటీ సీఎం కడియం

-ప్రాథమిక, ఉన్నత, ఇంటర్ విద్యపై సమీక్ష
-పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-అందరి భాగస్వామ్యంతో మౌలిక సదుపాయల కల్పనకు కృషి..
-రికార్డులు సిద్ధం చేస్తున్న అధికారులు
ఖమ్మం ఎడ్యుకేషన్,జూన్5:ప్రభుత్వ విద్యను పటిష్ట పరిచేందుకు సర్కార్ నడుంబిగించింది. అందులో భాగంగా ఈనెల 8న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జిల్లాకు రానున్నారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తోంది. దీనిలో బాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విద్యాశాఖపై సమీక్షలు చేశారు. విద్యాశాఖలోకి వచ్చే అన్ని రకాల స్థాయిల విద్యావ్యవస్థ పనితీరు, అభివృద్ధికి కృషి చేసేందుకు ఈనెల 8వ తేదీన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఖమ్మం రానున్నారు. 

ఉదయం 10 గంటల వరకు ఖమ్మం చేరుకుని మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి స్థాయిలో విద్యాశాఖపై చర్చించనున్నారు. ఈ సమీక్షలో స్కూల్ విద్య, ఇంటర్, ఉన్నత, టెక్నికల్ విద్యపై ఆయా శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులందరితో సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్ తదితర ప్రజా ప్రతినిధలు పాల్గొనున్నారు. వీరందరి సమక్షంలో జిల్లా విద్యాశాఖ నిర్వాహణ, సమస్యలు, ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవ్వనున్నారు. 

పటిష్టానికే పట్టం...
ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 8న జరిగే జిల్లా విద్యాశాఖ సమీక్షలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడంతో పాటు, వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ విద్యను పటిష్ట పరిచే భాధ్యతలో వారినే భాగస్వామ్యులను చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితులను వివరిస్తూ వాటిని పరిష్కరించేందుకు కలెక్టర్ బాధ్యత తీసుకోనున్నారు. ఆయా నియోజవర్గాల్లోని విద్యాలయాల్లో ప్రహరి, టాయిలెట్లు, మంచీనీరు, ఇలా పూర్తి స్థాలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నిధులను ఉపయోగించాలని సూచించనున్నారు. ప్రజాప్రతినిధి అందజేసే నిధులు రూ.2కోట్లు ఉంటే వాటికి అదనంగా మరో రూ.2కోట్లు కేటాయించి ఆ నిధులను కలెక్టర్ వద్ద ఉంచి ఆ నియోజకవర్గంలోనే ఖర్చుపెట్టే విధంగా ప్రణాలికలు రచించారు. దీంతో జిల్లా విద్యారంగం పటిష్టతకు సుమారు రూ.50 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

తొలుత పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్...
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచేందుకు అవసరంగా సమీక్షలో చర్చించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ లక్ష్యాలను చేదించనున్నారు. విద్యార్థుల నమోదుతో పాటు పది ఫలితాలపై విశ్లేషణ, విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును వివరించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షకు విద్యాశాఖకు చెందిన అధికారులు నివేధికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

No comments:

Post a Comment