Thursday, 9 June 2016

గ్రానైట్‌ను ఆదుకుంటా..

గ్రానైట్‌ను ఆదుకుంటా..

-సంపూర్ణ సహకారం అందిస్తా
-గ్రానైట్ యజమానుల కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
-ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం శుభసూచికం
-ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
-యజమానుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా
-ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం వ్యవసాయం, జూన్ 8: గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం, యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలో సీక్వెల్ రిసార్ట్స్‌లో జరిగిన గ్రానైట్, స్లాబ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

గ్రానైట్ పరిశ్రమ అభివృద్ది కోసం అనాటి నుండి నేటి వరకు తన వంతు కృషి చేశానని, రానున్న రోజుల్లో గ్రానైట్ యజమానులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట రోడ్లు భవనాలు, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బధవారం సాయంత్రం నగరంలోని సీక్వెల్ రీస్టార్ట్‌లో జరిగిన గ్రానైట్, స్లాబ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమ కొంత సంక్షోభంలో ఉన్నప్పటికీ యజమానులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభసూచీకమన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో గ్రానైట్ పరిశ్రమను కాపాడుకునేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో సైతం అప్పటి గనుల శాఖ మంత్రిని జిల్లాకు రప్పించి గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను వివరించడం జరిగిందన్నారు. 

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి గ్రానైట్‌శాఖకు సంబంధించిన మంత్రిని సైతం జిల్లాకు తీసుకొచ్చి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను యజమానుల ఎదుట వివరించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర విద్యుత్ సరఫరాతో గ్రానైట్ పరిశ్రమకు ఎంతో మేలు జరిగిందని ఆయన వివరించారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి గ్రానైట్ యజమానుల సమస్యలను తీసుకొచ్చి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, నగర మేయర్ జీ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మేళ్ల చెర్వు వెంకటేశ్వరరావు, గ్రానైట్ సంఘం గౌరవ అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సీపీఎం నాయకుడు యర్రా శ్రీకాంత్, గ్రానైట్ సంఘం నాయకులు కర్నాటి వీరభద్రం, పారా నాగేశ్వరరావు, నల్లమోతు శ్రీనివాసులుతో పాటు పలువురు గ్రానైట్ పరిశ్రమల యజమానులు, నూతన కార్యవర్గ సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా...- ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జిల్లాలో గ్రానైట్ యజమానులు ఎదుర్కొనే సమస్యలను రాబోయే పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ దృష్టికి గ్రానైట్ యజమానుల సమస్యలను ప్రస్తావించడం జరిగిందన్నారు. స్వయంగా మంత్రి గ్రానైట్ పరిశ్రమలు మూత పడి ఉండటాన్ని గమనించి తన నుంచి వివరాలు తీసుకున్నాడన్నారు. జిల్లాలో గ్రానైట్, ఖనిజ నిక్షేపాలు ఏజెన్సీ ప్రాంతంలో, ఫారెస్ట్ భూములలో అధికంగా ఉన్నాయన్నారు. ఆ ఖనిజాలను వెలికితీస్తే గ్రానైట్ పరిశ్రమ మరింత పురోభివృద్ధి సాధించి తీరుతుందన్నారు. 

ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయం...-ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్
ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ కొంత ఇబ్బందిలో ఉన్నప్పటికీ సంబంధిత పరిశ్రమ యజమానులు కలిసికట్టుగా ఉండి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కమిటీ బాధ్యులుగా ఎన్నికైన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికకావడం గ్రానైట్ పరిశ్రమలకు ఎంతో మేలు చేకూరే అవకాశముందన్నారు. గ్రానైట్ పరిశ్రమ యజమానులు ఎదుర్కొనే సమస్యలను తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

రాయల్టీ, ట్యాక్స్‌లతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం...
- సంఘం నూతన అధ్యక్షుడు తాళ్లూరి మధుసూదన్‌రావు
రోజురోజుకు పెరిగిపోతున్న రాయల్టీ, ట్యాక్స్‌లతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రానైట్, స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లూరి మధుసూదన్‌రావు అన్నారు. ఎన్నో సమస్యలకోర్చి పరిశ్రమలు పెట్టుకున్నప్పటికీ నేక ఒడిదుడుకులను ఎదుర్కొవడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కొంత ఇబ్బందికరమేనని ఆయన వాఖ్యానించారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు అండగా ఉండటం కొంత ఊరటనిచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

అనంతరం సంఘం నూతన కమిటీ బాధ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రవికుమార్, కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా పుచ్చకాయల నాగేశ్వరరావు, ఎస్‌కే ఖాసీం, జొన్నలగడ్డ రవికుమార్, కొణకంచి వీరభద్రారావు, మిక్కిలినేని నరేందర్, మంకెన శేఖర్, సహాయ కార్యదర్శులుగా కేఎస్‌పీ ముఖర్జీ, గార్లపాటి రఘునందన్‌రెడ్డి, వల్లూరు భద్రారెడ్డి, పుచ్చకాయల మాధవరావు, తమ్మినేని నవీన్, దొడ్డా రమేష్, రవి, తేజావత్ కిషన్, సీహెచ్ విశ్వనాథం ఉన్నారు. ఈ ప్రమాణస్వీకారోత్స కార్యక్రమానికి అతిథులుగా వరంగల్, కరీంనగర్ జిల్లా సంఘం అధ్యక్షులు హాజరయ్యారు.

No comments:

Post a Comment