-కొత్త జిల్లా ఏర్పాటుకు వేగంగా కసరత్తు
ఖమ్మం నమస్తే తెలంగాణ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థమే ప్రధాన లక్ష్యంగా జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. నైసర్గిక స్వరూపం, ప్రజల ప్రయోజనాలు ప్రధాన లక్ష్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీని కొరకు హైదాబాద్లో రెండు రోజుల నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమావేశం ఏర్పాటు చేశారు. తొలి రోజు సీసీఎల్ ఏ అధికారులు సుదీర్ఘంగా కలెక్టర్లతో మాట్లాడి సమగ్ర నివేదికలను తీసుకున్నారు. రెండో రోజు బుధవారం సీఎం కేసీఆర్ కలెక్టర్ల సమావేశానికి హాజరై కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, మండలాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై పలు సూచనలను అందజేశారు.
జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు కానున్నప్పటికీ ఇంత వరకు దీనిపై జిల్లా అధికారులు ప్రభుత్వానికి ఎలాంటి నివేదికను అందించలేదు. జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలను సమాంతరంగా విభజించిన అధికారులు ఐదు నియోజకవర్గాలకు ఒక జిల్లాగా ప్రతిపాదించారు.వీటిలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మ ధిర శాసనసభ నియోజక వ ర్గాలుండగా, కొత్తగూడెంజిల్లాలో కొత్తగూడెంతో పా టు భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి.
అయి తే ప్రస్తు త జిల్లాలో ఉన్న 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో 3 రెవెన్యూ డివిజన్ లు కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఒక్క రెవెన్యూ డివిజన్ మాత్రమే నూతనంగా ఏ ర్పాటు కాబోయే ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఒక్కొక్క జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మాత్రమే ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీ ఎం సూచించడంతో ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు, కల్లూరు లేదా సత్తుపల్లి కేంద్రాలుగా మరో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయనున్నారు.
మండలాల పునర్విభజనకు సీఎం పచ్చ జెండా...
ప్రజా అభిప్రాయ నిర్ణయం మేరకే మండలా లు, కొత్త జిల్లాలు ఉండేలా అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం కలెక్టర్లకు సూ చించారు. పెద్ద మండలాలను రెండుగా చేసే అవకాశముంటే వాటిని కూడా జిల్లా అధికారులు పరిశీలించనున్నారు. ఒక మండల కేంద్రానికి ఆ మండలంలోని ఏదైనా గ్రామం దూరంగా ఉండి పక్క మండల కేంద్రానికి దగ్గరగా ఉంటే అందులో చేర్చే విధంగా మార్పులు చేయనున్నారు. ఒక్కొక్క మండల జనాభా 50 నుంచి 60 వేల వరకు ఉం టుంది. 20 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటవుతుంది. 1.50 లక్షల మంది జనాభాతో అర్బన్ మండలాలను ఏర్పాటు చేయనున్నారు.
కొత్తగా ఐదు మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
ప్రస్తుతం జిల్లా జనాభా, నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ కొత్తగా ఐ దు మండలాలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలుస్తుంది. వీటిలో ఖ మ్మం అర్బన్, కొత్తగూడెం అర్బన్, పాల్వంచ అర్బ న్, గుండాలను రెండు మండలాలుగా ఏర్పాటు చేయనున్నారు. 1953లో ఖమ్మం జిల్లా ఏర్పాటైం ది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన 2014 వరకు జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి.
తెలంగాణ పునర్విభజనలో జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశా రు. మిగిలిన 39 మండలాలకు కొత్తగా రెండు మండలాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 41 మండాలలు ఉన్నాయి. అయితే జిల్లా కలెక్టర్ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన నివేదికలో కొత్తగూడెం కేంద్రంగా ఏర్పాట య్యే నూతన జిల్లా లో 21 మండలాలు, ఖమ్మం జిల్లాలో 20 మండలాలు ఉండే విధంగా నివేదిక అందజేశారు. అయితే బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనల మేరకు జిల్లాలో మండలాల సంఖ్య పెరిగే అవకాశముంది. మండలాల పునర్విభవజనలో సైతం అనేకం జరిగే అవకాశలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. జనాభా ప్రాతిపాదికన విభజిస్తే మండలాల సంఖ్య దాదాపు 50 దాటుతుంది.
దసరాకు కొత్త జిల్లాల ప్రకటన...
జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఈ నెల 20వ తేదీలోపు సమగ్ర నివేదికను తయారు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ నెల20వ తేదీన హైదరాబాద్లో మరొకసారి కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలు తీసుకుని రావాలని కలెక్టర్లకు సూచించారు. అదే విధంగా కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతున్నప్పటికీ ఏ పేరుతో ఏ ర్పాటయ్యే విషయంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం జరగలేదు. కలెక్టర్ ఇచ్చిన నూతన ప్రతిపాదనను ప్రభుత్వం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందించనుంది.
ఆయన ఆధ్వర్యంలో ఈ నెల 30 లోపు జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరిస్తారు. అప్పటి వరకు అధికారుల కోర్టులో ఉన్న బాల్ రాజకీయ నాయకుల చేతుల్లోకి మారుతుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం తిరిగి ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. జూన్ 5న మరొకసారి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 10 తేదీ లోపు హైదరాబాద్లో అన్ని పార్టీల నాయకులతో రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశం జరి గే అవకాశముంది.
ఆ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు ఇచ్చిన సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి 10 తేదీలోపు డ్రాప్ట్ నోటిపికేషన్ విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు. వారి నుంచి వచ్చిన వినతు లు, సూచనలు పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లా ప్రకటన దసరా నాటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది.
మహబూబాబాద్ పేరుతో కొత్త జిల్లా...?
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ కేంద్రం గా మరో జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు ఆ జిల్లా అధికారులకు తగిన సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అయితే మహబూబాబాద్ నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న ఇల్లెందు నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు మండలాలను ఆ నియోజకవర్గంలో కలుపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఖనిజ సంపదకు వనరులైన బయ్యా రం, గార్ల మండలాలను మహబూబాబాద్ జిల్లా లో కలిపే అవకాశం చర్చకొచ్చింది. జిల్లా కేంద్రాని కి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాం తాలు ఆ జిల్లాలో ఉండే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనను జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులు వ్యతిరేకించే అవకాశముంది.
No comments:
Post a Comment