Wednesday, 1 June 2016



ఉత్తమ ఉద్యోగిగా రాజమోహన్‌





    ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగుల్లో ఖమ్మం జిల్లాకు స్థానం దక్కింది. జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌, అయిదో దశలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎ.రాజమోహన్‌ ఎంపికయ్యారు. ఈయనకు రూ.1,00,116, శాలువా, జ్ఞాపికను బహూకరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 8మంది ఉద్యోగులను ఎంపిక చేయగా రాజామోహన్‌కు అందులో స్థానం దక్కింది.

    No comments:

    Post a Comment