-మధిరలో ఎవరిని అడిగినా చెబుతారు..
-జిల్లాను సర్వనాశనం చేసింది నువ్వు కాదా..?
-కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లను బెదిరించిన చరిత్ర నీది...
-ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోం...
-విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యే అజయ్
ఖమ్మం కమాన్బజార్ :అవినీతికి కేరాఫ్ భట్టివిక్రమార్క అని.. జిల్లాలో అభివృద్ధి పరుగులు తీస్తుంటే చూసి తట్టుకోలేక స్థాయికి మించిమాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్లు మధిర ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఆదివారం ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పది సంవత్సరాల పాలనలో జిల్లాలో ఏ నియోజకవర్గంలో నైనా అభివృద్ధి జరిగిందో భట్టి చూపించాలని సవాల్ విసిరారు. తన స్థాయికి మించి ఆరో పణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జిల్లా ఇతర జిల్లాల కంటే అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలిచిందన్నారు.
కమాన్బజార్, జూన్ 5: అవినీతికి కేరాఫ్ భట్టి వి(అ)క్రమార్కగా పేరు వచ్చింది. మధిరలో ఎవరిని అడిగినా చెబుతారు. జిల్లాలో అభివృద్ధి పరుగులు తీస్తుంటే చూసి తట్టుకోలేక స్థాయిని మించి మాట్లాడుతున్నాడు అని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి రాజకీయ వ్యభిచారానికి నాంది పలికారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లకు కక్కుర్తిపడి పనుల్లో నాణ్యతా లేకున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు.
వారి పదేళ్ల పాలనలో జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా అభివృద్ధి జరిగిందో భట్టి విక్రమార్క చూపించాలని సవాల్ విసిరారు. మధిరలో కాంట్రాక్టర్లను బెదిరించి అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాతనే పనులకు శంకుస్థాపన చేసేవారని, కాంగ్రెస్ పార్టీని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో చీకటి వ్యాపారానికి తెరలేపారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో ఏరోజు కూడా కమీషన్లకు లాలూచీ పడలేదని, దానికి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధియే నిదర్శనమన్నారు.
పాలేరు ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 45 వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అది చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. భట్టి విక్రమార్కకు తన స్థాయికి మించి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత జిల్లా ఇతర జిల్లాల కంటే అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలో దళారీ వ్యవస్థను ప్రోత్సాహించి జిల్లాను సర్వనాశనం చేసింది నువ్వు కాదా.. ?అని వారు ప్రశ్నించారు. మధిర జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరితే ఏం మాట్లాడని భట్టి.. నేడు సీపీఐకు చెందిన ఎంపీపీ టీఆర్ఎస్లో చేరితే ఎం దుకు స్పందించారో ప్రజలకు తెలపాలన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లా సస్యశ్యామలం అవుతుందని, జిల్లా అభివృద్ధి చూసి రాజకీయాలకతీతంగా టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్పై నమ్మకంతో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను కడుపులో పెట్టుకుని,కనీవిని ఎరుగని రీతిలో గెలిపించుకుంటున్నారన్నారు. రాబో యే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని వారు అన్నారు. ఇప్పటికైనా భట్టి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిదని, లేకపోతే ప్రజలు, కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మందడపు తిరుమలరావు, మందడపు సుధాకర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment